కందులపాడు అడ్డరోడ్డుకు సమీపంలో ఓ కారులో శుక్రవారం సాయంత్రం మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చి పరిశీలించగా, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వకు చెందిన జేసీబీ డ్రైవర్ అన్నెబోయిన నాగరాజు (35) మృతిచెందినట్లు తెలిపారు. కారులో ఊపిరాడక చనిపోయాడా? లేక మరేదైనా కారణమా అన్న అనుమానాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.