పెనుగంచిప్రోలులోని ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే

పెనుగంచిప్రోలులో బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటైన ప్రజాదర్బార్ ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. ప్రజలు సమస్యలు అర్జీ రూపంలో ఇచ్చారని, వాటిని సంబంధిత విభాగాల అధికారులకు పంపించామన్నారు. అర్జీ రూపంలో వచ్చిన ప్రతి సమస్య త్వరగా పూర్తయ్యే విధంగా చూస్తామన్నారు.