మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. పింఛన్ల పండగ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం కాలనీలో ఎమ్మెల్యే పింఛన్ పంపిణీలో పాల్గొంటారు. ఇబ్రహీంపట్నం, జి కొండూరు, మైలవరం టౌన్, రెడ్డిగూడెం మండలాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే విచ్చేస్తున్నట్లుగా తెలిపారు.