మైలవరంలో నూజివీడు రహదారి మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉందని వాహనదారులు గురువారం వాపోయారు. నూతన తారు రోడ్డు నిర్మాణానికి పాత రోడ్డు తీసివేసి నెలలు గడుస్తున్న పూర్తి చేయలేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా భాస్కర్ నగర్ కాలనీ ఎస్సీ కాలనీ వద్ద రోడ్డుపై దుమ్ము ఎగసిపడుతోందని వాహనాదారులు అంటున్నారు.