ఇబ్రహీంపట్నం జూపూడి గ్రామంలో ఏబీసీ సర్వీస్ సెంటర్ లో గురువారం పచ్చిగోళ్ళ పండు ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రాజశేఖర్ (నెహ్రూ ) 8వ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు పచ్చిగోళ్ళ పండు దేవినేని చిత్రపటానికి పూలమాలనేసి నివాళులు అర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. బత్తుల రాజేష్ ఏబీసీ సర్వీస్ సెంటర్ చైర్మన్, సభ్యులు దేవినేని నెహ్రూ అభిమానులు పాల్గొన్నారు.