మైలవరంలోని పుల్లురు సెక్టారు పొందుగల-3 అంగన్ వాడీ కేంద్రంతో శుక్రవారం కిషోర వికాసం బాలికల కార్యక్రమం నిర్వహించారు. ఐ సి డి యస్ సూపర్ వైజర్ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. 11 నుంచి 18 సంవత్సరాల బాలికలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించామన్నారు. చిన్న వయసులో వివాహం చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు.