మైలవరం నియోజకవర్గంలో 137 గోకులాల నిర్మాణానికి కాను రూ. 2. 87 కోట్లు మంజూరు చేసినట్లు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మాణం పూర్తయిన గోకులాన్నీ శాసనసభ్యులు కృష్ణప్రసాదు శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు.