మైలవరం: ప్రభుత్వాలు మారినా... మారని రోడ్ల దుస్థితి

60చూసినవారు
మైలవరం: ప్రభుత్వాలు ఎన్ని మారిన రహదారుల దుస్థితి మారడం లేదని స్థానికులు ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్ అతి ఉత్సాహంతో ఎక్కువ బిల్లులు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హడావుడిగా రహదారి పనులు ప్రారంభించారన్నారు. అవి పూర్తి కాకుండానే, ఆ కాంట్రాక్టర్ పట్టాలేకుండా పోవడంతో స్థానికులు వాహనదారులు 2 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సంఘటన మైలవరం మండలంలో చోటుచేసుకుంది. అధికారులు స్పందించి రోడ్డు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్