ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలోని గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పాస్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలియజేశారు. ఫాదర్స్ డే సందర్భంగా కొంత మంది తండ్రులను శాలువాలతో సన్మానించారు.