2025 జనవరిలో మూడు రోజులపాటు 9, 10, 11తేదీలలో జరిగే కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవాలకు హాజరవ్వాలని గొల్లపూడి పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావుకు ఉర్సు మహోత్సవ కమిటీ సభ్యులు శనివారం ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్ఎం పైజాన్, మహమ్మద్ అప్సర్, షేక్ ముస్తఫా భాష, షమ్స్ తబరేజ్ తదితరులు పాల్గొన్నారు.