జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం విజయవాడలో కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. మైలవరం నియోజక వర్గంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.