కొండపల్లి శ్రామిక నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రాంగణాన్ని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శుక్రవారం మెరక చేయించి తన మంచి మనసును చాటుకున్నారు. పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. గోతులు ఉండి విద్యార్థులు కిందపడి గాయాలపాలవుతున్నట్లు హెచ్ఎం వివరించారు. ఆవరణను మెరక చేయిస్తానని హామీ ఇచ్చారు. మరుసటి రోజే ఆరు ట్రాక్టర్ల డస్ట్ తోలించి స్వయంగా ఆవరణలో పరిచి మెరక చేశారు.