విజయవాడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపండి

71చూసినవారు
విజయవాడ: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. ఆచూకీ తెలపండి
విజయవాడ జాతీయ రహదారిపై గుంటుపల్లి ఒక కన్వెన్షన్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని విజయవాడ జీజీహెచ్ కు తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 40- 45ఏళ్లు ఉంటాయని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 9440627084, 9059121109 సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్