విస్సన్నపేట మండలం సత్తెనగూడెం గ్రామంలో ఉపాధి హామి పని ప్రాంతాన్ని మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు సందర్శించారు. ఉపాధి బకాయిలపై కూలీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో 2025 మార్చినాటికి 4 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో 12 వారాలు కూలీల వేతనాలు బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.