నందిగామలో ఈనెల 1వ తేదీన జరిగిన వివాహిత మల్లెల దుర్గ స్రవంతి హత్య కేసులో ముద్దాయి అచ్చి పెద్దబాబును శుక్రవారం ఏసీపీ తిలక్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి అచ్చి నరసింహారావుకు దుర్గా స్రవంతికి మధ్య వివాహేతర సంబంధం ఉందని వివరించారు. ఆర్థిక లావాదేవీలు, దుర్గ స్రవంతిపై అనుమానంతో హత్య చేశాడన్నారు. కుమారుడు ఆశీష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.