చందర్లపాడు మండలం గుడిమెట్లలో శుక్రవారం శ్రీ నీలగిరి అంకమ్మ తల్లి, గంగమ్మ తల్లి, పాతపాటి అంకమ్మ తల్లి, కాటమరాజు దేవాలయాల పునః నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ దేవాలయాలకు ఎన్నో ఏళ్ళ పురాతన చరిత్ర ఉందని 200 ఏళ్ళ నాడు ఈ దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగిందని గ్రామంలో ఎటువంటి కార్యక్రమము తలపెట్టినా ముందుగా గ్రామదేవతలు మొక్కు తీర్చుకుంటారన్నారు.