చందర్లపాడులో కొలువైన గ్రామ దేవత శ్రీ అలివేలమ్మ తల్లి తిరుణాల మహోత్సవాలు 5రోజుల పాటు విశేషంగా జరగనున్నాయి. కాగా శనివారం సాయంత్రం భారీ బందోబస్త్ మధ్య ఊరేగింపు జరుగనుంది. ప్రతి సంవత్సరము వైశాఖ త్రయోదశి నుండి ఐదు రోజులు పాటు తిరణాల జరగటం ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి చందర్లపాడు నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి అమ్మవారి మొక్కులు తీర్చుకోడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.