కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం నందిగామ మున్సిపల్ అత్యవసర సమావేశంలో సౌమ్య పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే పట్టణాభివృద్ధికి రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఎక్కడా రాజీపడకుండా పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ రమణబాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.