వీరులపాడు మండలం జయంతి గ్రామంలో పండించిన మామిడిని రైతులు భోపాల్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. టన్నుకు రూ.15,000 నుంచి రూ.20,000 ధర ఉండవచ్చని వారు తెలిపారు. గురువారం వీచిన ఈదురుగాలుల వల్ల మామిడికి తీవ్ర నష్టం వాటిల్లిందని, కోత ఖర్చులు కూడా ఎక్కువవుతున్నాయని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.