అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం చాలా విషాదకరమని ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు.