గత ప్రభుత్వంలో కంచికచర్ల నుంచి మధిర వెళ్లే రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారి, ప్రయాణికులు భయంతో ప్రయాణించేవారు.బుధవారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా కంచికచర్ల బస్టాండ్ నుంచి మధిర వెళ్లే రోడ్డు ఆధునికీకరణతో వాహనదారులు సురక్షితంగా, సౌకర్యవంతంగా దూసుకెళ్తున్నారు.