నందిగామ: క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించిన కొండ్రగుంట

71చూసినవారు
నందిగామ: క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభించిన కొండ్రగుంట
వీర్లపాడు మండలం జమ్మవరం గ్రామంలో కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను మండల పార్టీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధి ప్రాముఖ్యతను గుర్తిస్తూ యువకులను పోటీలలో పాల్గొని ప్రతిభను చూపాలని కోరారు. పోటీల చివరిదినం గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 7,116 రూపాయలు అందజేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్