నందిగామ పరిధిలోని జుజ్జూరు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో నిర్మించిన దేవాలయ ముఖ ద్వారాన్ని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అంతేకాకుండా కార్యాలయాన్ని, యాగశాలను కూటమి నేతలు, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆమె బుధవారం ప్రారంభించారు.