ఈనెల ఆరవ తేదీన కంచికచర్ల మండలంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. మొగులూరు గ్రామంలో జడ్పీ పాఠశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులతో కలిసి పరిశీలించారు. అంతేకాక రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కూడా హాజరవుతారని ఆమె వివరించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై పోలీసులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.