కంచికచర్ల మండలం కొత్త పెండ్యాలలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. కాలువలో పూడికలు తీసుకోకపోవడంతో డ్రైన్లో అనేక వ్యర్థాలు నిండిపోయి, నీటి ప్రవాహం నిలిచిపోతుందన్నారు. దీంతో దుర్గంధం కూడా వ్యాపిస్తుందని చెప్పారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువలో పూడికలు తీసే చర్యలు చేపట్టాలని వారు కోరారు.