ముఖ్యమంత్రి నిధి నుంచి షేక్ ఆరిఫ్ కుమార్తె ఫౌజియాకు అవసరమైన చికిత్స కోసం రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి అందజేశారని నందిగామ ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. కంచికచర్ల మండలం మోగులూరు కు చెందిన ఫౌజియా తల్లిదండ్రులకు చెక్కు రూపంలో సహాయం అందించారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఫౌజీయా చికిత్సకు (కిడ్నీ సంబంధిత)సాయం కోరగా, రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించారని తెలిపారు.