ముసునూరు మండల వ్యాప్తంగా ఎక్కడైనా సరే కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముసునూరు ఎస్సై ఎం. చిరంజీవి హెచ్చరించారు. శనివారం ముసునూరు మండలం లోపూడి, చెక్కపల్లి రోడ్ లో కోడిపందాలు వద్దు సాంప్రదాయ క్రీడలు ముద్దు అనే నినాదంతో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. చెక్కపల్లి, కాట్రేనిపాడు గ్రామాల్లో కోడిపందాలు పోలీసులు ధ్వంసం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.