చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామంలో గతంలో భూ బత్తుల అప్పారావు మామిడి తోటలో భూగర్భ జలాలు నిల్వకోసం ఫారం పౌండు పని చేపట్టారు. బుధవారం ఈ పనిని పరిశీలించేందుకు బూత్ కన్వీనర్ నక్క రాము, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ తాతయ్య బాబు కలిసి పరిశీలించారు. నక్క రావు మాట్లాడుతూ నీటిని నిల్వ చేసే పని మంచిదని దాని ద్వారా భూగర్భంలోకి నీరు ఇంకి భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయన్నారు.