ఆగిరపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో శనివారం పలు కార్యక్రమాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటీంచారు. గ్రామంలోని తనను కలవడానికి వచ్చిన ప్రతీ వారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది వృద్ధులు తాము పేదరికంలో ఉన్నామని మంత్రి వివరించారు.