పంచాయతీ నిధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నూజివీడు పంచాయతీ అధికారిణి సుందరి హెచ్చరించారు. చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. చాట్రాయి మండలానికి కార్యదర్శులను నియమించామని వారికి రికార్డులు సక్రమంగా అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ నిధుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.