చాట్రాయి గ్రామంలో శనివారం డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది పాల్గొని జై భీమ్ నినాదాలతో గ్రామం మార్మోగింది. ముఖ్య అతిథులుగా హైకోర్టు అడ్వకేట్ పాలేటి మహేష్, సీఈవో మల్లికార్జున రావు పాల్గొన్నారు. మాల యోధుల సంఘం నేతలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.