నూజివీడు మండలం రామన్నగూడెంలో టీడీపీ ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షుల నియామకం శనివారం జరగగా పరిశీలకులుగా నక్క రాము హాజరయ్యారు. రామన్నగూడెం గ్రామ టిడిపి అధ్యక్షులుగా వడ్డీ వీర వెంకట సత్యనారాయణ, కార్యదర్శిగా కొడాలి విజయ మోహన్ ఏకగ్రీవంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో నియమించారు. నియామక పరిశీలకులుగా నక్క రాము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.