ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: మంత్రి
![ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: మంత్రి](https://media.getlokalapp.com/cache/b6/a8/b6a8839eda75fc643fed64c281477dd9.webp)
ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. శనివారం నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. 285 దరఖాస్తులు ప్రజల నుండి అధికారులకు అందినట్లుగా తెలిపారు. కొన్ని దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే అక్కడికక్కడే పరిష్కరించేలా మంత్రి ఆదేశించారు.