రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నట్లు పౌర సంబంధాల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆగిరిపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ప్రజా దర్బార్ లో ప్రజల నుండి వినతి లను మంత్రి స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.