మొవ్వ మండలంలో రహదారులు అద్వాన్నంగా ఉండటంతో చినుకు పడితే రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. గురు, శుక్రవారాల్లో పడిన వర్షాలకు కూచిపూడి బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ సరిగా లేకపోవటంతో నీరు బయటకు కదిలే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగించారు. మండలంలోని రహదారులు ఇదే స్థితిలో ఉండడం పట్ల ప్రజల అసహనంగా వ్యక్తం చేస్తున్నారు.