పామర్రు: రైతుల పంట పొలాల్లో జండా కర్రలు

67చూసినవారు
పామర్రు: రైతుల పంట పొలాల్లో జండా కర్రలు
పట్టభూముల సర్వే పేరుతో రైతుల పంట పొలాల్లో జండా కర్రలు పాతిన సంఘటన పామర్రు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలం తోడేలుదిబ్బ గ్రామంలో శుక్రవారం ఓ ప్రవేట్ సర్వేయర్ రైతుల అనుమతి లేకుండా జండా పాతడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ గా వచ్చిన రెడ్డిని రైతులు అడ్డగించారు. దీంతో జండా పాతిన పొలం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్