కళా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. పామర్రు మండలం యలకుర్రు గ్రామంలో భ్రమరాంబ చెన్నమల్లికార్జున స్వామివారి కళావేదిక నందు విశ్వదాత అవార్డుల ప్రధానోత్సవ సభలో (విశ్వదాత అవార్డులు-2025) గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాన్న వర్ల రామయ్యకు కళాకారులు అంటే ఎంతో మక్కువ అని తెలిపారు. పలువురు కళాకారులను సత్కరించారు.