బంటుమిల్లి మండలం ములపర్రులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీని ఆర్ఐ శివశంకర్ అదుపులోకి ఆదివారం తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వాహనాలని సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించామని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్వో గంగాజలం, వీఆర్ఎ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.