అన్నదాతలకు కష్టం తగ్గించేందుకు చేపట్టిన వ్యవసాయం యాంత్రీకరణ పథకం ద్వారా గూడూరు రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించినట్లు పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం గూడూరు మండలంలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, దమ్ము సోట్లు, రోటవేటర్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.