216 జాతీయ రహదారి చెరుకుమిల్లి అడ్డరోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మునిపెడకు చెందిన కాకర ఫణి (38) బంటుమిల్లి నుంచి కృత్తివెన్ను వైపు బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫణి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.