పెడన మండలం నందమూరు గ్రామంలో పీఎం సూర్య ఘర్ అవగాహన సదస్సు, సింగిల్ విండో కార్యక్రమంలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీఎం సూర్య ఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వినూత్న విధానాలతో ముందుకు సాగుతుందన్నారు. అనంతరం ఈ పథకం పొందిన లబ్ధిదారులకు చెక్కులను అందించారు.