పెడన: 'రాజకీయ కక్షతో పెన్షన్ నిలిపివేశారు'

57చూసినవారు
పెడన మండలం లంకలకలవగుంటకి చెందిన నాగరాజు తన వృద్ధాప్య పెన్షన్ ను సర్పంచ్ భర్త, ఆయన అనుచరులు రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే తనపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మూడు సార్లు తన పెన్షన్ను అధికారులు నిలిపివేశారని, కోర్టు ఆదేశాలతో తిరిగి అదే పెన్షన్ మంజూరు చేశారని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్