హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పట్టణ టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించారు. పెడన పట్టణంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం సుమారు రూ. 5 కోట్లు అంచనాలు రూపొందించి ఎంపీ వల్లభనేని బాలశౌరికి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కి అభివృద్ధి కమిటీ వినతిపత్రం గతంలో అందజేశారు. శుక్రవారం హిందూ శ్మశాన వాటిక పురోగతిపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో సమీక్షించారు.