రౌతుల రమేశ్ ఆత్మహత్యకు కారకుడైన కేజీఎన్ బాజీపై చర్యలు తీసుకోవాలని రమేశ్ కుటుంబ సభ్యులు శనివారం పెడన పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానంటూ బాజీ బెదిరించడంతోనే రమేశ్ చనిపోయాడని స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.