పెడన మండలం చోడవరం గ్రామంలో శనివారం ఉదయం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరిగింది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వం చేపట్టిన పధకాల గురించి ప్రజలకు వివరించారు. దీపం పధకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం కింద ప్రజలకు ప్రభుత్వం మేలు చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు.