పెద్ద మొత్తంలో కేంద్రం నిధుల కేటాయించేలా చంద్రబాబు కృషి చేశారని కంకిపాడు మండల టిడిపి నాయకులు యలమంచిలి కిషోర్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధుల కేటాయి౦పు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని కూటమి కొలువుదీరిన యాభై రోజులలోనే రాజధాని అమరావతి మొదలు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజక్టు వరకు నిధుల కేటాయించేలా కృషి చేశారని తెలిపారు.