తెలుగుదేశం ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన ఉచిత ఇసుక విధానం వలన నేడు భవన కార్మికులకు ఎంతో ఉపాధి చేకూరిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మంగళవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికే మూడు అంశాలను టీడీసీ అధినేత చంద్రబాబు అమలు చేయడం జరిగిందని మాట తప్పకుండా అన్నిటినీ అమలు చేస్తున్నారన్నారు.