ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మహిళ ఓ ఇంజినీరుకు చేదు అనుభవం మిగిల్చింది. కానూరులో కలుసుకుందాం అని చాటింగ్తో పిలిచి, అక్కడికి వచ్చిన అతడిని ఆమె ముగ్గురితో కలిసి బెదిరించి రూ.3.11 లక్షలు తీసుకున్నారు. కృష్ణలంకకు చెందిన ఇంజినీర్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెనమలూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి రాజేశ్వరి సహా మిగిలినవారిపై దర్యాప్తు ప్రారంభించారు.