ఆర్మీ డే పురస్కరించుకుని ఉయ్యూరులోని అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య చెరుకు రైతుల సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎమ్. శివనాధ్ మాట్లాడుతూ వివిధ దేశాల్లో తమ సాయుధ దళాల అంకితభావం, శౌర్యం మరియు త్యాగాలను గౌరవించటానికి, దేశ భద్రతను కాపాడటంలో శాంతిని కాపాడటంలో సైనికుల కృషిని గుర్తించే రోజు ఆర్మీ డే అని పేర్కొన్నారు.