తిరువూరు శాంతినగర్ ఏరియాలో బాల్య వివాహాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో బాల్వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఈ కాలంలో పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేసారు. కిషోర్ బాలికల వికాసం కోసం ప్రభుత్వం విడుదల చేసిన అంగన్వాడి సెంటర్ లో ఉన్న పుస్తకాలను చదివి అవగాహన పెంచుకోవాలని మహిళా పోలీస్ విజయలక్ష్మి వివరించారు.